అమరావతి : ఏపీలోని విజయవాడ డివిజన్ పరిధిలో నడిచే పలు రైళ్లను( Trains) రద్దు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రైల్వే లైన్ (Railway Lines) ఆధునికీకరణ పనుల వల్ల పలు ప్యాసింజర్ (Passenger) , ఎక్స్ప్రెస్(Express) రైళ్లను జూన్ 24 నుంచి ఆగస్టు 11 వరకు రద్దు చేసినట్లు అధికారికంగా ప్రకటించారు.
విశాఖ- గుంటూరు (17240) సింహాద్రి(Simhadri), గుంటూరు-విశాఖ (17239) సింహాద్రిని, విశాఖ- తిరుపతి 22707) డబుల్ డెక్కర్ ఎక్స్ ప్రెస్ , విశాఖ- విజయవాడ (12717) రత్నాచల్ ఎక్స్ ప్రెస్(Ratnachal) , రాజమండ్రి – విశాఖ (07466) ప్యాసింజర్, విశాఖ-రాజమండ్రి (07467) ప్యాసింజర్, విజయవాడ-విశాఖ (12718) రత్నాచల్ ఎక్స్ప్రెస్, గుంటూరు- విశాఖ (22702) ఉదయ్ ఎక్స్ ప్రెస్, విశాఖ-గుంటూరు (22701) ఉదయ్ ఎక్స్ ప్రెస్ను రద్దు చేశారు.
అదేవిధంగా ఈనెల 23 నుంచి ఆగస్టు 10 వరకు మచిలీపట్నం- విశాఖ (17219), విశాఖ-మచిలీపట్నం (17220) ఎక్ ప్రెస్, గుంటూరు-రాయగఢ్ (17243), విశాఖ- లింగంపల్లి (12805) జన్మభూమి ఎక్స్ ప్రెస్ రద్దయ్యాయి. ఈనెల 24 నుంచి ఆగస్టు 11 వరకు రాయగడ-గుంటూరు (17244), లింగంపల్లి-విశాఖ (12806) జన్మభూమి ఎక్స్ ప్రెస్ లను రద్దు చేశారు. ఈనెల 24 నుంచి ఆగస్టు 9 వరకు తిరుపతి-విశాఖ (22708) డబుల్ డెక్కర్ ఎక్స్ ప్రెస్ రద్దయిన జాబితాలో ఉన్నాయి.