అమరావతి : ఏపీలోని మాచర్ల నియోజకవర్గంలో జరిగిన హింసాత్మక ఘటనలపై ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (MLA Pinnelli) కి మరోసారి ఏపీ హైకోర్టు (High Court) లో ఊరట లభించింది. ఇప్పటికే ఈవీఎం(EVM) ధ్వంసం ఘటనలో ముందస్తు బెయిల్ పొందిన పిన్నెల్లిపై మరో మూడు కేసుల్లో తనను అరెస్టు చేయవద్దంటూ దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు సానుకూలంగా స్పందించింది. అయితే పోలీసులు జూన్ 6 వరకు అరెస్టు చేయవద్దంటూ మధ్యంతర తీర్పు నిచ్చింది .
పోలింగ్ రోజున, అనంతరం పిన్నెల్లితో సహ అతడి అనుచరుల దాడుల్లో గాయపడ్డ బాధితులు పిన్నెల్లిని అరెస్టు చేయాలని కేసులు నమోదు చేశారు. దీంతో పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్ (Bail Petition) దాఖలు చేసుకోగా నిన్న జరిగిన వాదనలను కోర్టు తీర్పును రిజర్వు చేసింది . మంగళవారం కోర్టు సెషన్ ప్రారంభం కాగానే కోర్టు పిన్నెల్లి పిటిషన్పై తీర్పును వెల్లడించింది. తదుపరి విచారణను జూన్ 6వ తేదీకి వాయిదా వేసింది.