అమరావతి : ఆంధ్రప్రదేశ్లో నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయాల (YCP Offices) కూల్చివేతపై ఏపీ హైకోర్టు( AP High Court) గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. కూల్చివేత విషయంలో తొందరపాటు వద్దని సూచిస్తూ స్టేటస్కో(Status co) విధిస్తున్నట్లు వెల్లడించింది. వైసీపీ (YCP) ఇచ్చే వివరణను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.
భవనాలకు అనుమతులకు సంబంధించిన డాక్యుమెంట్లు అన్నీ రెండు వారాల్లో సమర్పించాలని వైసీపీ తరుఫున పిటిషనర్లకు తెలియజేసింది. ఏదైనా చర్యలు చట్టపరంగానే కొనసాగించాలని , హైకోర్టు నిబంధనలు ఫాల్లో అవ్వాలని ఏపీ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. టీడీపీ(TDP) కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ కార్యాలయాల నిర్మాణాలు అక్రమమంటూ నోటీసులు అందజేస్తూ కూల్చివేతకు ఉపక్రమించింది.
దీంతో వైసీపీ బాధ్యులు ముందస్తుగా మిగతా కార్యాలయాల నిర్మాణాలను అడ్డుకోవాలని ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషన్లపై విచారణ గురువారం కొనసాగగా ప్రభుత్వం, ప్రతివాదుల తరుఫున న్యాయవాదులు పాల్గొని తమ వాదనలు వినిపించారు.