AP News | వైఎస్సార్ కడప జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కమలాపురం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్సై నాగార్జునరెడ్డి రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.
ఎప్పటిలాగే నైట్ డ్యూటీ పూర్తి చేసుకున్న నాగార్జునరెడ్డి బుధవారం ఉదయం ఇంటికి బయల్దేరారు. మార్గమధ్యలో తాటిగొట్ల సమీపంలో రైలు కింద పడి బలవ్మరణానికి పాల్పడ్డారు. అయితే చనిపోయే ముందు ఆయన తన యూనిఫామ్ను తీసేశారు. దాన్ని నీట్గా మడతపెట్టి పక్కనబెట్టారు. అనంతరం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. కాగా, ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
నాగార్జున రెడ్డి ఆత్మహత్యతో తోటి పోలీసులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించారు. ఏఎస్సై నాగార్జున రెడ్డి ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై జిల్లా ఎస్సీ సిద్ధార్థ కౌశల్ ఆరా తీస్తున్నారు.