అమరావతి : ప్రధాని నరేంద్ర మోదీ ( Narendra Modi ) కి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan)లేఖ రాశారు. రాష్ట్రంలో జనగన్న ఇళ్ల నిర్మాణం( Housing) పేరిట భారీ కుంభకోణానికి పాల్పడ్డారని ఏపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. భూసేకరణ పేరిటి రూ. 35,141 కోట్ల నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపించారు.ఈ అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని ఆయన కోరారు.
ఇళ్లపట్టాలు, నిర్మాణంపై ప్రభుత్వం విభిన్న ప్రకటనలు చేస్తోందని, సీబీఐ వంటి సంస్థలతో దర్యాప్తు చేయిస్తే వాస్తవాలు బయటపడుతాయని వెల్లడించారు. గతంల నిర్మించిన టిడ్కో ఇళ్లను కూడా పూర్తిగా లబ్ధిదారులకు ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో 2.24 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తయితే 86,984 మందికే ఇచ్చారని పేర్కొన్నారు.