అమరావతి : తనకు ప్రాణహాని ఉందని, భద్రతను పునరుద్ధరించాలని కోరుతూ మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు (Ambati Rambabu) ఏపీ హైకోర్టు (High Court) లో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటి వరకు ఉన్న ఫోర్ ప్లస్ ఫోర్ గన్మెన్ల (Gunmens) భద్రతను యధావిధిగా కొనసాగించాలని కోరారు. భద్రతను ఉపసంహరించడాన్ని సవాల్ చేస్తూ కోర్టులో అంబటి పిటిషన్ వేశారు.
భద్రత పునరుద్ధరణపై పల్నాడు ఎస్పీ, డీజీపీకి వినతిపత్రాలు సమర్పించినా ప్రయోజనం లేదని వాపోయారు. ఈ పిటిషన్ను పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి ఇరువాదనలు విని తదుపరి విచారణను ఈనెల 10వ తేదీకి వాయిదా వేశారు. ఈ వ్యాజ్యానికి సంబంధించి పూర్తి వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించారు.