అమరావతి : తిరుమలలో( Tirumala) భక్తుల రద్దీ(Huge crowd) భారీగా పెరిగింది. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్టు మెంట్లన్నీ నిండిపోయి వెలుపల క్యూ లైనులో భక్తులు వేచి ఉన్నారు. ఈ నేపథ్యంలో టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతున్నదని టీటీడీ అధికార వర్గాలు తెలి పాయి. నిన్న శ్రీవారిని(Venkateshwara swamy) 80,404 మంది భక్తులు దర్శించుకున్నారు. 35,825 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం 3.83 కోట్లుగా తేలింది.
టీటీడీ ఈవో శ్యామలరావు కీలక నిర్ణయం
టీటీడీ ఈవో శ్యామలరావు కీలక నిర్ణయం నిర్ణయం తీసుకున్నారు. 2023 ఆగస్టు 7 వ తేదీ నుంచి 2024 మార్చి 11వ తేది వరకు జరిగిన 8 పాలక మండలి తీర్మానాలను టీటీడీ వెబ్సైట్లో పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. టీటీడీ పాలకమండలి నిర్ణయాలు పారదర్శకంగా భక్తులు ముందు ఉంచాలని ఈవో నిర్ణయం తీసుకున్నట్లు గా తెలిసింది. కాగా, ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత టీటీడీ ఈవోగా అదనపు బాధ్యతలు నిర్వహి స్తున్న ధర్మారెడ్డిని తప్పించి ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న శ్యామలరావును కూటమి ప్రభు త్వం టీటీడీ ఈవోగా నియమించిన విషయం తెలిసిందే.