అమరావతి : జనసేన బాగోగులు కోరే కాపు నాయకుడు, మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య(Harirama Jogaiah) ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) కు మరో లేఖ(Letter) రాశారు. అధికారంలోకి వచ్చిన నెలరోజుల తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్కు శుభాకాంక్షలు తెలియజేస్తూ పలు కీలక సూచనలు చేశారు.
మీ పాలనలో సంక్షేమం, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తారని భావిస్తున్నానని , అభివృద్ధి కూడా ఒకేచోట కేంద్రీకరించొద్దని సూచించారు. సంక్షేమ ఫలాలు ప్రజల అవసరాలు తీర్చే విధంగా ఉండాలే తప్పా రాజకీయ లబ్ధి కోరే విధంగా ఉండకూడదని పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు కాపు(Kapu) లను బీసీల్లో చేరుస్తామని, రిజర్వేషన్లు (Reservations) కల్పిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చలేదని గుర్తు చేశారు.
పవన్ సినిమాలు మానేయకుండా సగం రోజులు షూటింగులు, మిగిలిన సగం రోజులు రాష్ట్ర పరిపాలనకు కేటాయించాలని, సమాజానికి ఉపయోగపడే విధంగా సందేశాత్మకంగా సినిమాలు చేయాలని సూచించారు. జిల్లా, మండల పరిషత్, పంచాయతీరాజ్ వ్యవస్థలను ఆ శాఖ మంత్రిగా బలోపేతం చేయాలని లేఖలో పేర్కొన్నారు. గ్రామాల్లో కనీస మౌలిక వసతులు కల్పించాలని ఆయన కోరారు.