అమరావతి : ఏపీలో సందిగ్ధావస్థలో కొట్టుమిట్టాడుతున్న వాలంటీర్లపై త్వరలో మంచి నిర్ణయం తీసుకుంటామని మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh ) వెల్లడించారు. నిడదవోలులో ఆయన మీడియాతో ఆదివారం మాట్లాడారు. గత ప్రభుత్వానికి మించి కూటమి సర్కారు(Alliance Government) సంక్షేమం అందిస్తోందని, రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్తామని అన్నారు.
జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో రూ. వెయ్యి పెంచగా, కూటమి అధికారంలోకి రాగానే వెయ్యి పెంచి మూడు నెలలతో కలిపి మొత్తం రూ. 7 వేలు ఇస్తుందని పేర్కొన్నారు. జులై 1వ తేదీ నాడే 90 శాతం వరకు పింఛన్ల పంపిణీ చేయాలని ఆదేశించినట్లు వెల్లడించారు. వైసీపీ ఐదేండ్ల పాలనలో ప్రభుత్వ విధానాలు అస్తవ్యస్తంగా జరగటం వల్ల అభివృద్ధి కుంటుపడిందని పేర్కొన్నారు.