అమరావతి : నంద్యాల జిల్లాలో మహిళను చంపిన చిరుత (Leopard) ను ఎట్టకేలాగు అటవిశాఖ అధికారులు(Forest Officer) పట్టుకున్నారు. అధికారులు వేసిన కుక్క ఎరకు బోనులో చిరుత చిక్కింది. నాలుగురోజులుగా కునుకు లేకుండా చేసినా చిరుత చిక్కిన విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఊపిరిపీల్చుకుంటున్నారు.
ఈనెల 25న నంద్యాల(Nandyala), గిద్దలూరు మధ్య పచ్చర్ల గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ మెహరున్నీసా అనే మహిళ (Women) వంట చెరుకు కోసం అడవిలోకి వెళ్లగా చిరుత దాడి చేసి చంపేసింది. ఆమెతో పాటు మరో ఇద్దరిపైనా కూడా దాడి చేసింది. ఆమెతో వెళ్లిన వారు గ్రామానికి వచ్చి సమీప అటవిప్రాంతంలో గాలించగా అప్పటికే ఆమెను చంపి తింటున చిరుత ఆమె తలను వేరు చేసి వెంట తీసుకెళ్లింది. విషయాన్ని అటవిశాఖ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించడంతో వారు బలగాలతో చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ ఘటనతో భయాందోళనకు గురైన గ్రామస్తులు కునుకులేకుండా కాలం గడిపారు. చిరుతను బంధించాలని హైవే రోడ్డు(Highway Road) పై బైఠాయించి ఆందోళన చేపట్టారు. చిరుతను ఎలాగైనా పట్టుకోవాలన్న లక్ష్యంతో అటవిప్రాంతంలోని పాలు ప్రాంతాల్లో బోనులు ఏర్పాటుచేశారు. చివరకు నిన్న రాత్రి బోనులో ఉన్న కుక్క కోసం వచ్చిన చిరుత బోనులో చిక్కుకుపోయింది.
ప్రస్తుతం పట్టుబడిన చిరుత వయస్సు 5 నుంచి 6 సంవత్సరాలు ఉంటుందని అటవీ అధికారులు వెల్లడించారు. పచ్చర్ల వద్ద బోనులో చిక్కిన చిరుతను తిరుపతి జూపార్క్ కు తరలించనున్నట్లు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు.