తిరుమల : తిరుమల (Tirumala) శ్రీవారికి నివేదించే అన్నప్రసాదం (Annaprasadam)పై వస్తున్న అవాస్తవ విషయాలను భక్తులను నమ్మవద్దని టీటీడీ(TTD) అధికారులు కోరారు. సేంద్రియ బియ్యం వాడకాన్ని నిలిపివేసి గతంలో వినియోగించే బియ్యాన్ని వాడాలని టీటీడీ నిర్ణయించిందని, అదేవిధంగా అన్నప్రసాదాల దిట్టంకూడా పెంచాలని టీటీడీ నిర్ణయించినట్లు సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం పూర్తిగా అసత్యమని ఈవో జె శ్యామల రావు కొట్టిపారేశారు.
అర్చక స్వాములు, ఆలయ అధికారులతో ఇటీవల సమావేశమై స్వామివారికి నివేదించే అన్న ప్రసాదాల గురించి, వాటి దిట్టం గురించి సుదీర్ఘంగా చర్చించామని వెల్లడించారు. వీటిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన వెల్లడించారు .
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గుముఖం పట్టింది. వివిధ ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనానికి వస్తున్న భక్తులతో 8 కంపార్టుమెంట్లు (Compartment) నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 6 నుంచి 8 గంటలల్లో సర్వదర్శనం కలుగుతుందని అధికారులు వివరించారు. నిన్న స్వామవారిని 67,398 మంది భక్తులు దర్శించుకోగా 26,512 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.09 కోట్లు వచ్చిందని తెలిపారు.