Srisailam | శ్రీశైలం భ్రమరాంబ అమ్మవారికి హైదరాబాద్కు చెందిన నూకల నటరాజ్ అనే వ్యక్తుడు బంగారు లక్ష్మీకాసుల హారాన్ని కానుకగా సమర్పించారు. 375 గ్రాముల బంగారు హారాన్ని దేవస్థానానికి సమర్పించారు. ఈ హారం విలువ రూ.24,41,433 ఉంటుందని దాతలు తెలిపారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో నటరాజ్ బంగారు హారాన్ని అమ్మవారి ఆలయ ప్రధానార్చకులు మార్కండేయస్వామి, ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి హరిదాసు, అమ్మవారి ఆలయం ఇన్స్పెక్టర్ రామనాయుడులకు అందజేశారు. ఈ సందర్భంగా దాతలతో మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం స్వామివారి శేషవస్త్రాలతో సత్కరించి, తీర్థ ప్రసాదాలను అందజేశారు.