అమరావతి : తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వర స్వామిని, అటు భూదేవి,శ్రీదేవిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులతో ఆలయం కిటకిటలాడుతుంది. మొత్తం 31 కంపార్టుమెంట్లకు గాను 21 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి.
టోకెన్లు లేని భక్తులకు 16-18 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ(TTD) అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 77,332 మంది భక్తులు దర్శించుకోగా 30,540 భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం (Hundi Income) రూ. 4.38 ఆదాయం వచ్చిందని తెలిపారు.
జూన్ ౩౦న వకుళమాత ఆలయ వార్షికోత్సవం
తిరుపతి : తిరుపతి సమీపంలోని పాత కాల్వ వద్ద పేరూరు బండపై ఉన్న వకుళమాత(Vakulamata) ఆలయంలో జూన్ 30న వార్షికోత్సవ ఉత్సవం వైభవంగా నిర్వహించనున్నామని అధికారులు వివరించారు. ఉదయం 8 గంటలకు మహాశాంతి హోమం, పూర్ణాహుతి , మధ్యాహ్నం 12 గంటలకు అమ్మవారి ఉత్సవర్లకు అష్టోత్తర కలశాభిషేకం నిర్వహిస్తున్నామని వెల్లడించారు.