అమరావతి : ఆంధ్రప్రదేశ్లో స్టూడియోల (Studios) నిర్మాణానికి ముందుకు రావాలని రాష్ట్ర పర్యాటకశాఖ, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ (Minister Kandula Durgesh) చిత్ర పరిశ్రమ ప్రముఖులను కోరారు. గురువారం సచివాలయం రెండో బ్లాక్లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాబోయే రోజుల్లో కోనసీమ(Konaseema) ను అద్భుతంగా అభివృద్ధి చేస్తామని అన్నారు.
కోనసీమలో సినిమా చిత్రీకరణలు పెరిగేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. రాష్ట్రంలో పర్యాటక రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని పేర్కొన్నారు. ఎకో, టెంపుల్, అడ్వెంజర్ టూరిజాన్ని ప్రోత్సహిస్తామని వివరించారు. పర్యాటక రంగం ద్వారా నిధులు సమకూర్చుకునేలా కృషి చేస్తామని స్పష్టం చేశారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దేవాదాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.