హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ రాజధానికి నిర్ధారించిన అమరావతి ప్రాంతాన్ని గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించారు. రాజధాని నిర్మాణం కోసం ప్రధాని మోదీ గతంలో శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు. మంత్రులు, అఖిల భారత సర్వీసు అధికారులు, న్యాయమూర్తుల గృహ సముదాయాలను పరిశీలించి విలేకరులతో మాట్లాడారు. ఏపీ అంటే అమరావతి, పోలవరం అని పేర్కొన్నారు. పోలవరం పూర్తయితే రాయలసీమ సతనాల సీమగా మారుతుందని స్పష్టం చేశారు.