హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): ప్రపంచంలోనే అతి పెద్ద భూసేకరణ ప్రాజెక్టు అమరావతి అని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు.
సచివాలయంలో మీడియా సమావేశంలో రాజధాని అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేశారు. ప్రతి తెలుగు బిడ్డ అమరావతి నాది అని గర్వంగా గుర్తించాలని చెప్పారు. కొత్త ప్రణాళికలు లేవని, వాటినే కొనసాగిస్తూ నిర్మిస్తామని స్పష్టంచేశారు.