అమరావతి : గ్రామాలాభివృద్ధికి కేంద్రం నుంచి విడుదలవుతున్న నిధుల(Funds) ను సక్రమంగా వినియోగించుకోవాలని డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ (Deputy CM, Pawan kalyan) అధికారులను ఆదేశించారు. గురువారం విజయవాడ క్యాంపు కార్యాలయంలో గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్ విభాగాల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
వర్షాకాలంలో ప్రజలకు అందించే తాగునీటి సరఫరాలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అతిసారం కేసులు(Diarrhea Cases) ప్రబలకుండా స్వచ్ఛమైన మంచి నీటి సరఫరాపై ప్రత్యేక దృష్టిని సారించాలని, తాగునీటి సౌకర్యం లేని గ్రామాలపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. జల్ జీవన్ మిషన్ లాంటి కేంద్ర నిధులు వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం కేంద్ర నిధులు వాడుకోలేకపోయిందని తెలిపారు. జల్ జీవన్ మిషన్ అమలు నిధుల వివరాలు ఇవ్వాలని ఆయన వెల్లడించారు.