తిరుమల : తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయంలో ఈనెల 9, 16వ తేదీల్లో బ్రేక్దర్శనాలను (Break darsan) రద్దు చేసినట్లు టీటీడీ(TTD) వెల్లడించింది. జూలై 16న సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినం సందర్భంగా జూలై 9న నిర్వహించే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 16న బ్రేక్ దర్శనాలను రద్దు చేశామని అధికారులు తెలిపారు. ఈ కారణంగా జూలై 8, 15వ తేదీల్లో సిఫారసు లేఖలు స్వీకరించబడవని పేర్కొన్నారు.
లడ్డూ పోటుపై సమీక్ష
టీటీడీ ఈవో శ్యామలరావు(EO Shyamalarao) , జేఈవో వీరబ్రహ్మం శుక్రవారం తిరుమలలో లడ్డూ పోటు సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. గోకులం విశ్రాంతి భవనం సమావేశ మందిరంలో జరిగిన సమీక్షలో వైష్ణవ బ్రాహ్మణ , వైష్ణవ బ్రాహ్మణేతర వర్గాల్లోని లడ్డూల తయారీ కోసం వారి జాబ్చార్ట్తో సహా , సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. బూందీ ఫ్రై, షుగర్ సిరప్, జీడిపప్పు ఫ్రై, బూందీ మిక్సింగ్, లడ్డూ మౌల్డింగ్, ట్రే లిఫ్టింగ్, కన్వేయర్ బెల్ట్, ప్రసాదం పంపిణీ తదితర వాటిని పవర్ ప్రజంటేషన్ ద్వారా అధికారులు వివరించారు.