హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్గా మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు నియమితులుకానున్నారు. ఆయన అభ్యర్థిత్వాన్ని సీఎం చంద్రబాబు ఖరారు చేసినట్టు సమాచారం. జనసేనకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వనున్నారు. చీఫ్ విప్గా టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ధూలిపాళ్ల నరేంద్ర కుమార్ను నియమించనున్నట్టు తెలిసింది.