AP TET | ఏపీ ప్రభుత్వం టీచర్ అభ్యర్థులకు శుభవార్త చెప్పింది. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) నోటిఫికేషన్ను సోమవారం రాత్రి విద్యాశాఖ విడుదల చేసింది. దరఖాస్తుల ప్రక్రియ మంగళవారం నుంచి మొదలుకానున్నది. పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలనుcse.ap.gov.inలో పూర్తి వివరాలు అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది. పరీక్ష కోసం విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పింది. ఆగస్టులో టెట్ నిర్వహించే ఉండగా.. ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. మెగా డీఎస్సీకి త్వరలో ప్రత్యేక ప్రకటన విడుదల చేయనున్నది. వివిధ కేటగిరీల కింద 16,347 టీచర్ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఇటీవల కేబినెట్ సైతం మెగా డీఎస్సీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఆలోపు మెగా డీఎస్సీకి అర్హత అయిన టెట్ పరీక్షను మరోసారి నిర్వహించడం ద్వారా ఇంకా ఎవరైనా రాయాలనుకునే అభ్యర్థులకు ప్రభుత్వం వీలు కల్పించింది. ఇక ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ 10లోగా మెగా డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రభుత్వం తెలిపింది. అలాగే ప్రతీ జిల్లాలో 80శాతం పోస్టుల్ని స్థానికులకు ఇచ్చేలా, మరో 20 శాతం నాన్ లోకల్ అభ్యర్ధులకు కేటాయించేలా ఈసారి నోటిఫికేషన్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మంగళవారం టెట్కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానున్నది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జగన్ ప్రభుత్వం ఇచ్చిన డీఎస్పీ ప్రకటనను చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసింది. అప్పటి ప్రభుత్వం విడుదల చేసిన 6,100 టీచర్ పోస్టుల నోటిఫికేషన్ రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత అదనంగా పలు పోస్టులను కలిపి 16,347తో మెగా డీఎస్సీని ప్రకటించింది.