అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన టెట్-2024(AP TET) పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) ఫలితాలను విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెట్లో అర్హత సాధించిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. టెట్ పరీక్షలో 58.4 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారని తెలిపారు.
ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకు నిర్వహించిన టెట్కు 2,35,907 మంది పరీక్ష రాయగా , లక్షా 37,904 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారని వెల్లడించారు. టెట్లో అర్హత సాధించని వారికి మరోసారి టెట్ నిర్వహిస్తామని, కొత్తగా బీఎడ్, డీఎడ్ పూర్తయిన వారికి కొత్త టెట్లో అవకాశాలు కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. మెగా డీఎస్సీకి అందరూ సన్నద్ధం కావాలని పిలుపు నిచ్చారు.
టెట్ అర్హత, 20 శాతం వెయిటేజ్ ఉండడంతో అతృతగా ఎదురుచూశారని తెలిపారు. . కొత్తగా బీఎడ్(BEd), డీఎడ్(DEd) పూర్తి చేసుకున్న వారికి త్వరలోనే మళ్లీ టెట్ను నిర్వహిస్తామని వివరించారు. టెట్ ఫలితాల తరువాత మెగా డీఎస్సీ ప్రకటిస్తామని తెలిపారు.