YS Jagan | ఇటీవల లడఖ్లో శిక్షణలో భాగంగా యుద్ధ ట్యాంకుతో నదిని దాటే విన్యాసాలను చేస్తున్న సమయంలో అకస్మికంగా వరదలు సంభవించాయి. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. ఇందులో ఏపీకి చెందిన ముగ్గురు జవాన్లు ఉన్నారు. ఈ ఘటనపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించారు. ప్రమాద ఘటన తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. దేశ రక్షణ కోసం జవాన్ల త్యాగాలు మరువలేనివన్నారు. మరణించిన జవాన్లలో కృష్ణా జిల్లాకు చెందిన సాదరబోయిన నాగరాజు, ప్రకాశం జిల్లాకు చెందిన ముత్తుమల రామకృష్ణారెడ్డి, బాపట్ల జిల్లాకు చెందిన సుభాన్ ఖాన్ ఉండడం బాధాకరమన్నారు. ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు నివాళులర్పిస్తున్నానన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. శిక్షణ సమయంలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలకు రూ.కోటి చొప్పున ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని చంద్రబాబు సర్కారుకు సూచించారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేశారు.
లడఖ్లో యుద్ధ ట్యాంకు కొట్టుకుపోయిన ప్రమాదంలో జవాన్లు వీరమరణం పొందడం తీవ్రంగా కలిచివేసింది. దేశ రక్షణ కోసం జవాన్ల త్యాగాలు మరువలేనివి. వీరమరణం పొందిన జవాన్లలో కృష్ణా జిల్లాకి చెందిన సాదరబోయిన నాగరాజు, ప్రకాశం జిల్లాకి చెందిన ముత్తుముల రామకృష్ణారెడ్డి, బాపట్ల జిల్లాకి చెందిన…
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 1, 2024