Ap 10th Supply Results | ఏపీలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. మంత్రి నారా లోకేశ్ బుధవారం సాయంత్రం ఫలితాలను విడుదల చేశారు. పరీక్షల్లో పాసైన విద్యార్థులకు లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. మే 24 నుంచి జూన్ 3 వరకు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. విద్యార్థులు ఫలితాలను అధికారిక వెబ్సైట్ bse.ap.gov.in లో లాగిన్ అవ్వాలని విద్యాశాఖ తెలిపింది. హాల్ టిక్కెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన ఫలితాలను చూసుకోవచ్చని పేర్కొంది. సప్లిమెంటరీ పరీక్షలకు 1.6 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసిన విషయం తెలిసిందే.