అమరావతి : ఏపీలో రైల్వే ప్రయాణికులకు(Railway passengers) పెను ప్రమాదం తప్పింది. విజయనగరం (Vizianagaram district) జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. పలాస నుంచి రాయగడ వెళ్తున్న ప్యాసింజర్ రైలు కొత్తవలస వద్ద పట్టాలు తప్పింది. సాంకేతిక సమస్యతో ఇంజిన్, బోగి పట్టాలు తప్పి కొంతదూరం వెళ్లి నిలిచిపోయింది. ఆ సమయంలో రైలు నెమ్మదిగా వెళ్లడంతో ప్రయాణికులు క్షేమంగా బతికి బయటపడ్డారు. సమాచారం తెలుసుకున్న రైల్వే అధికారులు (Railway officials ) వెంటనే సహాయ చర్యలు చేపట్టేందుకు విశాఖ నుంచి ఘటనా స్థలానికి బయలు దేరారు.