అమరావతి : ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు(MLA Kolikapudi Srinivas rao) తో పాటు మరో 60 మంది అనుచరులపై కూడా పోలీసులు కేసు(Police Case) నమోదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. నిన్న జిల్లాలోని ఎ.కొండూరు మండలం కంభంపాడులో వైసీపీకి చెందిన ఎంపీపీ కాలసాని నాగలక్ష్మి భర్త చెన్నారావు అక్రమంగా భవనం కడుతున్నారని ముస్లిం మహిళ , మరో ఇద్దరు ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు.
దీంతో ఎమ్మెల్యే ఆదివారం ఆ భవనాన్ని పరిశీలించారు. భవన నిర్మాణం అక్రమమని, వాటిని తొలగించి బాధితులకు స్థలం అప్పగించాలని , లేకపోతే తానే కూల్చివేస్తానని ఫేస్బుక్(Face Book) లో పోస్టు పెట్టారు. వైసీపీ నాయకుడు స్పందించకపోవడంతో మంగళవారం ఎమ్మెల్యే, తన అనుచరులతో పొక్లెయిన్, బుల్డోజర్(Bulldozer) తో వచ్చి హంగామా సృష్టించారు. అక్కడికి వచ్చిన వైసీపీ ఎంపీపీ వర్గం అక్కడికి చేరుకోవడంతో ఆ ప్రాంతంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఆక్రమణ తొలగించే వరకు అక్కడి నుంచి కదలనని వాహనంపై ఎక్కి మొండికేశారు. పోలీసులు సముదాయించినా ససేమిరా అక్కడి నుంచి కదలలేదు. మరోవైపు పొక్లేయిన్ సిబ్బంది భవనాన్ని పాక్షికంగా కూల్చివేశారు. చివరకు అధికారుల కోరిక మేరకు ఎమ్మెల్యే, అతడి అనుచరులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం ఎంపీపీ నాగలక్ష్మి స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఎమ్మెల్యే కొలికపూడితో పాటు మరో 68 మందిపై కేసులు నమోదు చేశారు.