అమరావతి : ఏపీలోని విజయవాడ మీదుగా వెళ్లే పలు రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు. విజయవాడ రైల్వే (Vijayawada Railway) డివిజన్లో ట్రాక్ నిర్వహణ పనులు కొనసాగుతుండడంతో పలు రూట్లలో నడిచే రైళ్ల రాకపోకల్లో మార్పులు చేశారు. ముఖ్యంగా విజయవాడ మీదుగా వెళ్లే 25 రైళ్లను రద్దు (Trains Cancell) చేశారు. ఈ నెల 21 నుంచి ఆగస్టు 15 వరకు రైళ్లు రద్దు చేస్తున్నామని వెల్లడించారు.
ఈనెల 24 నుంచి 28 వరకు విజయవాడ మీదుగా వెళ్లే 8 రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు వివరించారు. 11 రైళ్లను దారి మళ్లించినట్లు తెలిపారు. ట్రాక్ నిర్వహణ వల్ల రైళ్లను రామవరప్పాడు(Ramavarappadu) స్టేషన్ వరకు నడుపుతున్నట్లు ప్రకటించారు.