తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవంగా కొలువబడుతున్న తిరుమల (Tirumala) వేంకటేశ్వరస్వామి దర్శనానికి టోకెన్లు లేకుండా వచ్చిన భక్తులకు సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుందని టీటీడీ(TTD) అధికారులు వెల్లడించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 31 కంపార్టుమెంట్లు (Compartments) నిండిపోయాయి.
నిన్న స్వామివారిని 66,256 మంది భక్తులు దర్శించుకోగా 30,087 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం(Hundi Income) రూ. 3.54 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు.
తిరుమల హోటల్స్లో సరసమైన ధరలకే ఆహారాన్ని అందించాలి
తిరుమలకు వచ్చే భక్తులకు మరింత నాణ్యమైన, రుచికరమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని సరసమైన ధరలకు అందించడమే టీటీడీ లక్ష్యమని ఈవో జె శ్యామలరావు (EO Shyamala) తెలిపారు. తిరుమలలోని పెద్ద, జనతా హోటళ్లపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు.
సరసమైన ధరలకు నాణ్యమైన ఆహారాన్ని అందించడానికి ప్రముఖమైన హోటళ్లతో జాబితా రూపొందించడానికి ఇండియన్ క్యులినరీ ఇన్స్టిట్యూట్ అధ్యాపకులు చలేశ్వరరావు , తాజ్ హోటల్స్ జిఎం చౌదరి సూచనలను ఆహ్వానించినట్లు తెలిపారు.