బొగ్గు గనుల వేలం, ప్రైవేటీకరణ వద్దే వద్దు.. అంటూ కార్మికులు, టీబీజీకేఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం గనులు, ఓసీపీలు, డిపార్ట్మెంట్లపై నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలిపారు. అధికారులకు వినతి పత్రాలు అందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బొగ్గు బావులను సింగరేణి సంస్థకే అప్పగించాలని, లేదంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
శ్రీరాంపూర్, జూలై 1 : శ్రీరాంపూర్ ఎస్సా ర్పీ-3 గనిపై మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు, టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కే సురేందర్రెడ్డి కార్మికులతో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలో పా ల్గొన్నారు. అనంతరం గనుల వేలాన్ని నిలిపి వేయాలని కోరుతూ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు పెట్టం లక్షణ్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పానగంటి సత్తయ్యతో కలిసి మేనేజర్ సంతోష్కుమార్కు వినతి పత్రం అందించారు. శ్రీరాంపూర్ ఓసీపీపై టీబీజీకేఎస్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి బండి రమేశ్, ఇన్చార్జి సుధాకర్, భాస్కర్రావు, లక్ష్మీనారాయణ, వినోద్కుమార్, ఆర్కే-5గనులపై ఇన్చార్జి దుర్గం రవి, ఇందారం ఓసీపీ, గనిపై ఇన్చార్జి రత్నాకర్రెడ్డి, గోపాల్, రవీందర్ ఆర్కే-7గనిపై రాజూనాయ క్, బిరుదు శ్రీనివాస్, ప్రతాప్, ఆర్కే న్యూటెక్ గనిపై ఎండీ లాలా, ఉప్పాల సంపత్, ఎస్సార్పీ-1గనిపై గోనె స్వామి, ఆర్కే-6గనిపై కేంద్ర చీఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి పొగాకు రమేశ్, ఆర్గనైజర్ అన్వేష్రెడ్డి, ముత్యాల రమేశ్, గని ఇన్చార్జి గొర్ల సంతోష్, ఎస్పార్పీ-3పై ఉత్తేజ్రెడ్డి, సాదుల భాస్కర్, వెంకట్రెడ్డి, ఏరియా స్టోర్ లో ఇన్చార్జి ఇసంపెల్లి ప్రభాకర్ ఆధ్వర్యంలో కార్మికులు అధికారులకు వినతి పత్రాలు అందించారు.
మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు, టీబీజీకేఎస్ అధ్యక్షుడు రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి సురేందర్రెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గనుల వేలాన్ని నిలిపి వేసి, సింగరేణికే గనులు అప్పగించాలని డిమాండ్ చేశారు. ప్రధాన మంత్రి హోదాలో రామగుండానికి వచ్చిన మోదీ గనులను ప్రైవేటీకరించమ ని, ఆ అధికారం తమకు లేదని స్పష్టం చేశారని గుర్తు చేశారు. తిరిగి చోటేబాయ్ రేవంత్ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గనుల వేలానికి శ్రీకారం చుట్టారని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వంలో సత్తుపల్లి, కోయగూడెం గనులను వేలంలో పెడితే అడ్డుకున్నామని గుర్తు చేశారు. సింగరేణి శ్రావణపల్లి బొగ్గు బ్లాకును వేలంలో పెట్టారని, వెంటనే విరమించు కోవాలని, లేదంటే ఒక్క బొగ్గు పెల్ల కూడా తీయనీయబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో నాయకులు గోపాల్, వెంకట్రెడ్డి, రమణారెడ్డి, సదానందం, శ్రీనివాస్, రాజేందర్, సం దీప్, పీ తిరుపతి, మల్లయ్య, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సుబ్బయ్య, కార్యదర్శి పవన్, రవిగౌడ్, రఫీఖ్కాన్, ప్రశాంత్, మధు, కాటం రాజు, భానుచందర్ పాల్గొన్నారు.
బెల్లంపల్లి, జూలై 1 : బెల్లంపల్లి సివిల్ డిపార్ట్మెంట్, శాంతిఖని గని ఆవరణలో టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కార్మికులు వేర్వేరుగా నల్లబాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం గని మేనేజర్ సంజయ్కుమార్ సిన్హా, సవిల్ డిపార్ట్మెంట్ అధికారి సతీశ్కు వినతిపత్రం అందించారు. టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ సం యుక్త కార్యదర్శులు శ్రీనివాస్, సిద్ధంశెట్టి సాజ న్, ఆర్గనైజింగ్ కార్యదర్శి రమణ, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు రమేశ్ మాట్లాడుతూ తెలంగాణలోని బొగ్గు బ్లాకులన్నీ సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేశారు. నాయకులు సూరం మల్లేశ్, హనుమంతరావు, అశోక్, విజయ్,వెంకటేశ్, సాయి, ఖాదర్, శ్రీకాంత్, మహేశ్, రాకేశ్, శ్రీనివాస్, భిక్షపతి, నసీరుద్దీన్, సందీప్, సాగర్ పాల్గొన్నారు.
కాసిపేట, జూలై 1 : మందమర్రి ఏరియాలోని కాసిపేట-1వ, కాసిపేట-2 ఇైంక్లెన్ గనులపై సోమవారం టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కార్మికు లు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. అనంతరం గని మేనేజర్లకు వినతిపత్రం అందించా రు. గనుల వేలాన్ని వ్యతిరేకిస్తూ టీబీజీకేఎస్ ఏరియా కార్యదర్శి వొడ్నాల రాజన్న ఆధ్వర్యం లో ఆందోళన చేపట్టారు. పిట్ కార్యదర్శి కారుకూరి తిరుపతి, సారంగపాణి, బైరి శంకర్, రమేశ్, కార్మికులు పాల్గొన్నారు.
బొగ్గు బ్లాకులను సింగరేణికి ఇవ్వాలని ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య డిమాండ్ చేశారు. సోమవారం మందమర్రి ఏరియాలోని కాసిపేట గనిపై ఏఐటీయూసీ గే ట్ మీటింగ్ నిర్వహించారు. సెంట్రల్ కార్యద ర్శి అక్బర్ అలీ, ఇప్పకాయ లింగయ్య, బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి మల్లేశ్, సలీంద్ర సత్యనారాయణ, తిరుపతి గౌడ్, బియ్యాల వెంకటస్వామి, పిట్ కార్యదర్శులు మీనుగు లక్ష్మీనారాయణ, గొల్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.
రామకృష్ణాపూర్,జూలై 1: రామకృష్ణాపూర్ సీహెచ్పీలో కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించిన నిరసన తెలిపారు. ఆర్కేపీ సీహెచ్పీ ఇన్చార్జి ఎస్ఈ ఈఅండ్ఎం అశోక్రెడ్డికి వినతి పత్రం అందచేశారు. టీబీజీకేఎస్ పిట్ కార్యదర్శి, నాయకులు పాల్గొన్నారు.
తాండూర్, జూలై 1 : తెలంగాణలోని బొగ్గు బ్లాక్లన్నింటినీ సింగరేణి సంస్థకే కేటాయించాలని టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాసరావు, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ ధరావత్ మంగీలాల్ డిమాండ్ చేశారు. బెల్లంపల్లి ఏరియాలోని వర్క్షాప్, స్టోర్స్లో కార్మికులతో కలిసి నిరసన చేపట్టారు. నల్ల బ్యాడ్జీలు ధరించి వర్క్షాప్ ఇంజినీర్ నరే శ్, స్టోర్స్ డీజీఎం శ్రీనివాసరావుకు వినతిపత్రా లు సమర్పించారు. టీబీజీకేఎస్ పిట్ సెక్రటరీ లు రాజేశం, గణపతి, ఏఐటీయూసీ పిట్ సెక్రటరీ రమేశ్, నాయకులు వైకుంఠం, వెంకటస్వామి, చంద్రయ్య, వెంకటేశం పాల్గొన్నారు.
మందమరి, జూలై 1: మందమర్రి ఏరియాలోని కేకే-5గని, ఏరియా వర్క్షాప్లలో టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం కేకే 5గని మేనేజర్ అల్లాఉద్దీన్, వర్క్షాప్ డీవైపీఎం నాగరాజుకు వినతి పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఉపాధ్యక్షు డు మేడిపల్లి సంపత్, టీబీజీకేఎస్ కేంద్ర డి ఫ్యూటీ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రవీందర్, బీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు వీరారెడ్డి, రాజయ్య, రాజలింగు, మల్లేశ్, కృష్ణసాయి, మొగిలి, పోలు సంపత్, లక్ష్మణ్, శ్రీనివాస్, భిల్లా మా ధవరెడ్డి, కొండల్రావు, గురువయ్య, తోట రా జిరెడ్డి, శ్రీనివాస్, ప్రభాకర్, రాజేందర్, బబ్బ ర మల్లేశ్, చక్రపాణి, రియాజ్ఆలీ, లింగయ్య, కోబూరి కిరణ్, హైమద్, లక్ష్మీనారాయణ, నగేశ్, మంచాల వెంకటి పాల్గొన్నారు.
రెబ్బెన, జూలై 1 : బెల్లంపల్లి ఏరియాలోని ఖైర్గూడ ఓసీపీ, గోలేటి సీహెచ్పీ, ఏరియా వర్క్షాప్లలో టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు. ఖైర్గూడ ఓసీపీ ఇన్చార్జి మేనేజర్ మధుసూదన్, గోలేటి సీహెచ్పీ డీజీఎం భీంరావుజాడేకు వినతిపత్రాలు అందించారు. బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాసరావు, ఏరియా కార్యదర్శి మారిన వెంకటేశ్వర్లు, కేంద్ర కమిటీ సభ్యుడు ఓరం కిరణ్, పిట్ కార్యదర్శులు మెరుగు రమేశ్, గడ్డం రవీందర్, రాజేశం, రమేశ్, నాయకులు సంపత్, సమ్మయ్య, జూనియర్ తిరుపతి, చంద్రయ్య, వైకుంఠం, గణపతి, దాసరి బాబురావు, కైత స్వామి, చందర్, దుంపల బాపు, అజీం, సంజీవ్, భిక్షపతి, శ్రీనివాస్ ఉన్నారు.