మంచిర్యాల అర్బన్, జూలై 1 :బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒకరూ కృషి చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ సోమవారం ఓ ప్రకటనలో కోరారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల, జైపూర్, బెల్లంపల్లిలో అన్ని శాఖల సమన్వయంతో జూలై 1 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించే ఆపరేషన్ ముసాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. బాలకార్మికులు, భిక్షాటన చేసే పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి అప్పగిస్తామని, లేదా స్టేట్ హోమ్కు తరలిస్తామని పేర్కొన్నారు.
చిన్న పిల్లలతో వెట్టి చాకిరీ చేయించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. బాల కా ర్మికులు కనిపిస్తే 1098, డయల్ 100కు స మాచారం అందించాలని కోరారు. మంచిర్యా ల -9848815120, జైపూర్ -94411 22702, బెల్లంపల్లి -9490435081 సబ్డివిజన్ల ఇన్చార్జి ఎస్ఐ నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు.
పిల్లలతో వెట్టిచాకిరీ చేయిస్తే కేసులు
ఆసిఫాబాద్ అంబేదర్చౌక్, జూలై 1 : జిల్లాలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒకరూ కృషి చేయాలని అదనపు ఎస్పీ ప్రభాకర్ రావు పేరొన్నారు. సోమవారం ఆసిఫాబాద్లోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆపరేషన్ ముస్కాన్పై సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాల్లో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఆసిఫాబాద్, కాగజ్నగర్ డివిజన్లలో రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ రెండు బృందాలు బాల కార్మికులను గుర్తించి బడుల్లో చేర్పిస్తాయన్నారు. పిల్లలతో వెట్టి చాకిరీ చేయించే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి భాసర్ , సీడబ్ల్యూసీ మెంబర్లు సమీరుల్లాఖాన్, దశరథ్, పరీక్షల సహాయ కమిషనర్ ఉదయ్ బాబు, డీసీపీవో మహేశ్, డీసీఆర్బీ సీఐ రమేశ్ పాల్గొన్నారు.