మంచిర్యాల ప్రతినిధి/కుమ్రం భీం ఆసిఫాబాద్ (నమస్తే తెలంగాణ) జూన్ 28 : ‘తెలంగాణ పచ్చబడాలే.. చెట్లు లేక బోసిపోయిన పల్లెలు, పట్టణాల్లో పచ్చదనం వెల్లివిరియాలే.. పరాయి పాలనలో నిర్జీవంగా మారిన అడవులకు పునరుజ్జీవం పోయాలే.. పర్యావరణ పరిరక్షణలో రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా నిలపాలే..’ అనే సదుద్దేశంతో కేసీఆర్ సర్కారు చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని కాంగ్రెస్ సర్కారు పట్టించుకోవడం లేదు. నాడు ఉమ్మ డి ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడ చూసినా పచ్చదనంతో కళకళలాడిన హరితహరం మొక్కలు.. నేడు కాంగ్రెస్ సర్కారు వైఫల్యంతో ఎండిపోయాయి.
కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలు, బృహత్ ప్రకృతి వనాలు కూడా ఎండిపోయి కళావిహీనంగా మారాయి. అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలు సైతం చాలా చోట్ల చనిపోయాయి. ఒకప్పుడు పచ్చదనానికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చిన పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, మున్సిపాలిటీ, ఫారెస్టు శాఖల అధికారులు పట్టించుకోలేదు. కొత్త మొక్కలు నాటకపోగా.. ఉన్నవాటిని కూడా కాపాడుకునే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం.
కేసీఆర్ హయాంలో తొలకరి జల్లులు (జూన్లో) పడగానే పట్టణాలు, పల్లెల్లో మొక్కలు నాటేవారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వానలు పడుతున్నా వనమహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించ లేదు. జూలై నుంచి మొక్కలు నాటాలని నిర్ణయం తీసుకున్నట్లు తె లుస్తున్నది. ఈ నేపథ్యంలో హరితహారం కిం ద గతంలో నాటిన మొక్కల ఆలనాపాలనా చూస్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలు చాలా చోట్ల ఎండిపోగా, వాటి స్థా నంలో కొత్తవి నాటుతారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఆసిఫాబాద్ జిల్లాలో 54 లక్ష లు, మంచిర్యాల జిల్లాలో 31.20 లక్షల మొ క్కలు నాటాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. మంచిర్యాల జిల్లాలో గ్రామీణాభివద్ధి శాఖ ఆధ్వర్యంలో 20 లక్షల మొక్కలు నా టనున్నారు. మిగిలినవి ఫారెస్టు, ఇతర డిపార్ట్మెంట్స్ ఆధ్వర్యంలో నాటనున్నారు. ఈ మేర కు జీపీల్లోని నర్సరీల్లో మొక్కలు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
నిర్మల్ అర్బన్, జూన్ 28 : నిర్మల్ జిల్లాలోని 396 గ్రామపంచాయతీల్లోని నర్సరీల్లో డీఆర్డీఏ శాఖ ఆధ్వర్యంలో 51.48 లక్షల మొక్కల పెంపకం చేపట్టగా, నాటేందుకు సిద్ధంగా ఉన్నాయి. దా దాపు 70-80 రకాల మొక్కలను సిద్ధం చేశారు. పదో విడుత హరితహారంలో నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 30.87 లక్షల మొక్కలను నాటేందుకు లక్ష్యం నిర్దేశించారు. కానీ ఇప్పటివరకు ప్రణాళికలు రూపొందించకపోవడం గమనార్హం. గత ప్రభుత్వం హయాంలో జిల్లాలో తొలకరి జల్లులు కురవగానే పట్టణాలు, పల్లెల్లో మొక్కలు నాటేందుకు గుంతలను సిద్ధం చేసేవారు.