జైనథ్(బేల), జూలై 2 : డీఎస్సీ పోస్టులను వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ అక్షయ్, జిల్లా హాస్టల్ కన్వీనర్ హరీశ్రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం వీపీ ఆధ్వర్యంలో బేల మండల కేంద్రంలోని శివాజీచౌక్ నుంచి అంబేద్కర్చౌక్ వరకు ర్యాలీగా వచ్చి రోడ్డుపై బైఠాయింంచారు. ఈ సందర్భంగా హరీశ్రెడ్డి మాట్లాడుతూ.. 25 వేల మెగా డీఎస్సీ పోస్టులను విడుదల చేయాలని డిమాండ్ చేశా రు. ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చే యాలన్నారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మహేశ్, కుర్మ పవన్రెడ్డి, అభిషేక్ అనూజ్రెడ్డి, శివారెడ్డి పాల్గొన్నారు.