కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో గుట్కా దందా జోరుగా సాగుతున్నది. కొందరు వ్యాపారులు పొరుగున ఉన్న మహారాష్ట్ర నుంచి గుట్టుచప్పుడు కాకుండా ఇక్కడికి తీసుకొచ్చి సొమ్ము చేసుకోవడం చర్చనీయాంశమవుతున్నది. రహస్య ప్రదేశాల్లోని గోదాముల్లో నిల్వ చేసి.. ఆపై పట్టణాలు, పల్లెలకు తరలిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. మత్తు పదార్థాలను అరికట్టేందుకు టాస్క్ఫోర్స్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ బ్రేక్ పడకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మహారాష్ట్ర నుంచి రైళ్లు, ఇతర వాహనాల్లో గుట్కాతో పాటు దేశీదారును జిల్లాకు తీసుకొస్తున్నారు. కాగజ్నగర్ను అడ్డాగా చేసుకొని జిల్లా వ్యాప్తంగా గుట్కాలు సరఫరా చేస్తున్నా రు. కొంత మంది వ్యా పారులు కేవలం ఈ దందానే తమ వృత్తిగా చేసుకొని జిల్లా వ్యాప్తం గా చిరు వ్యాపారులు, కిరా ణా దుకాణాలకు చేరవేస్తున్నారు. మండలాల వారీగా దళారులను ఏర్పాటు చేసుకొని ఈ వ్యాపారం సాగిస్తున్నారు. ఎవరికీ అనుమా నం రాకుండా తినుబండారాలు అమ్ముతున్నట్లుగానే మోటా రు సైకిళ్లు, చిన్న చిన్న గూడ్స్ వాహనాల్లో అం బార్, అనార్, ఖైనీ, కర్రవం టి మత్తు పదార్థాలను పల్లెలకు చేరవేస్తున్నా రు. మారుమూల ప్రాంతాల్లోని చిన్న చిన్న దు కాణాల్లో సైతం గుట్కా విచ్చలవిడిగా లభిస్తుందంటే దందా ఏ మేరకు సాగుతున్నదో అర్థమవుతున్నది.
ఇటీవల జిల్లా కేంద్రంలోని ఫారెస్ట్చెక్పోస్టు సమీపంలోగల గోదాంను టాస్క్ఫోర్స్ పోలీసులు తనిఖీచేయగా పెద్ద ఎత్తున దాచి ఉంచి న గుట్కా నిల్వలు బయటపడ్డాయి. సుమారు రూ. 8 లక్షల విలువ చేసే మత్తు పదార్థాలను పట్టుకున్నారు. అలాగే వాంకిడిలో రూ. 12 వేల విలువగల, పెంచికల్పేట్ మండలం బొంబాయిగూడ, మొట్లగూడలో రూ. 4500 విలువగల, కాగజ్నగర్లోని ఓ గోదాములో రూ. 2.56 లక్షల విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్ర నుంచి ఇక్కడికి వచ్చిన ఓ వ్యాపారి గుట్టు చప్పుడు కాకుండా ఈ దందా నిర్వహించడం చర్చనీయాంశమైంది.
జిల్లాలోకి మత్తు పదార్థాలు రవాణా కాకుండా టాస్స్ఫోర్స్ పోలీసులు గట్టినిఘా ఏర్పాటు చే సినప్పటికీ దందా ఆగడం లేదు. వాంకిడి చెక్పోస్టు వద్ద తనిఖీలు నామమాత్రంగా సాగుతున్నాయనే ఆరోపణలున్నాయి. బార్డర్లో ఉన్న వెంకటాపూర్ వద్ద చెక్పోస్టు లేకపోవడంతో వ్యాపారులకు కలిసి వస్తున్నది. ఈ మార్గం గుండా రాత్రి వేళల్లో గుట్కా తరలిస్తున్నట్లు తెలుస్తున్నది. అధికారులకు కచ్చితమైన సమాచారం ఉంటే తప్ప తనిఖీలు నిర్వహించకపోవడంతోనే యథేచ్ఛగా దందా సాగుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి.