ఆసిఫాబాద్ టౌన్, జూన్ 26: కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాజేందర్, ముంజం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బుధవారం కలెక్టరేట్ ఎదుట కార్మికులు ధర్నా చేశారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు కనీస వేతనం రూ.26 వేలతో పాటు, ఉద్యోగ భద్రత, బీమా, ఈఎస్ఐ తదితర సమస్యలు పరిషరించాలని డిమాండ్ చేశారు. ఐదు నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలు, ఈఎస్ఐ బకాయిలు చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకుడు కృష్ణమాచారి, గ్రామపంచాయతీ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు మోరేశ్వర్, ఆసిఫాబాద్ మున్సిపల్ కార్మిక సంఘం అధ్యక్షుడు మాట్ల రాజు, కార్మికులు పాల్గొన్నారు.