‘తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొనడమే నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చింది. ఉద్యమకారిణిగా గుర్తించే సీఎం కేసీఆర్ నన్ను రెండో సారి ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యురాలిగా నియమించారు. ఈ నిర్ణయంతో ఆదివాసీ బిడ్డల ఆత్మగౌరవం మరింత పెరిగింది. దళితులు, గిరిజనులకు అండగా ఉండి.. సమస్యల పరిష్కారానికి శాయశక్తులా కృషి చేస్తా.. ఇందుకు అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు’.. అని ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యురాలు నీలాదేవి అన్నారు. ప్రభుత్వం తనను మరోసారి నియమించిన సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’తో శుక్రవారం ఆమె మాట్లాడారు.
ఇచ్చోడ(సిరికొండ), సెప్టెంబర్ 22: తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యురాలిగా ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని రాయిగూడకు చెందిన కుస్రం నీలాదేవి అలియాస్ పెందూర్ నీలాబాయి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇది వరకు 2018-21 వరకు మూడేళ్ల పాటుగా సభ్యురాలిగా పని చేశారు. ఈ మేరకు మరోమారు ఆమెకు అవకాశం దక్కింది. ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యురాలిగా రెండోసారి నియమించారు. ఆమెతో నమస్తే తెలంగాణ ప్రత్యేక ఇంటార్వ్యూ.
నీలాదేవి: మారుమూల గ్రామానికి చెందిన ఉద్యమకారిణి అయిన నన్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యురాలిగా రెండోసారి నియమించడం చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఉద్యమం చేసిన నాలాంటి వారిని ముఖ్యమంత్రి కేసీఆర్ గుండెల్లో పెట్టుకొని గౌరవిస్తారు. గోండు జాతి నుంచి అవకాశం ఇవ్వడంతో మా జాతి ఆత్మగౌరవం మరింత పెరిగింది. ఈ అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు.
నీలాదేవి: 2019-21 సంవత్సరాల్లో అప్పటి ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్, సభ్యులందరం కలిసి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పరిధిలో 10,500 కేసులుండగా 8500 కేసులను పరిష్కరించాం. సభ్యులందరం కలిసి ఎస్సీ, ఎస్టీ కమిషన్ ద్వారా అవగాహన సదస్సులు నిర్వహించాం. రాష్ట్ర ప్రభుత్వంపై భరోసాతో కమిషన్ను ఆశ్రయించిన బాధితులను ఆదుకోవడం జరుగుతుంది. క్షేత్రస్థాయిలో పర్యటించి, దళిత, గిరిజన సమస్యలు తెలుసుకొని పరిష్కరించాం. పౌర హక్కుల దినోత్సవం ప్రతి నెలా జరిగే విధంగా చేశాం. జనతా అదాలత్ ద్వారా పర్యటించి అనేక ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిష్కరించాం. అండమాన్, కర్ణాటక రాష్ర్టాల్లో అక్కడున్న కమిషన్లను సందర్శించాం. అదేవిధంగా తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ను దేశంలోనే ఉత్తమ కమిషన్గా చూడాలనే సీఎం కేసీఆర్ ఆశయ సాధన కోసం కృషి చేశాం.
నీలాదేవి: 2001లో కేసీఆర్ పిలుపుతో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను. తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతి చేయడంతో రోడ్లపై వంటవార్పు, రాస్తారోకో, నిరాహార దీక్షలు, రహదారులు నిర్బంధం, అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాలు నిర్వహించాం. కేసీఆర్కు అప్పటి నుంచి ఆదివాసీ బిడ్డలపై ప్రత్యేక అభిమానం ఉండేది. కేసీఆర్తో కలిసినప్పుడు ఆదివాసుల ఆర్థిక ఎదుగుదల గురించి వారికి సమస్యల పరిష్కారం గురించి అడిగి తెలుసుకునే వారు. నాడు ఉద్యమంలో తనతో ఉన్న ఉద్యమకారులను గుర్తించి, వారికి పదవులు ఇవ్వడం సంతోషంగా ఉంది.
నీలాదేవి: తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ను దేశంలోనే ఉత్తమ కమిషన్గా తీర్చిదిద్దేందుకు చైర్మన్ తో పాటు సభ్యులమంతా కృషి చేస్తాం. క్షేత్రస్థాయిలో పర్యటించి ఎస్సీ, ఎస్టీ చట్టాలు, రాష్ట్ర ప్రభు త్వం అమలు చేస్తున్న పథకాల గురించి వివరిస్తాం. క్షేత్రస్థాయిలో వారి సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తాం. సమస్యలపై కమిషన్ సభ్యులను కలిస్తే, సాధ్యమైనంత వరకు అప్పటికప్పుడే పరిష్కరించేందుకు కృషి చేస్తాం. నాపై నమ్మకంతో రెండోసారి అవకాశం ఇచ్చేందుకు సహకరించిన మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు.