శ్రీరాంపూర్, జూలై 4 : ‘నోటీసులివ్వకుండా ఇల్లెలా కూల్చేశారు.. తమకు న్యాయం చేయకుంటే విషం తాగుతాం’ అంటూ మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరాంపూర్లోగల ఠాగూర్నగర్కు చెందిన గొల్లె దశరథం కుమార్, కుమారులు తిరుపతి, భానుచందర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం నస్పూర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట మందు డబ్బాతో కుటుంబ సభ్యులతో కలిసి ధర్నాకు దిగారు.
వారు మాట్లాడుతూ ఠాగూర్నగర్లోని సర్వే నంబర్ 45లో తమ వారసత్వంగా వస్తున్న 11 గుంటల్లో నిర్మించుకున్న ఇంటిని కూల్చివేశారని, తమకు న్యాయం చేయకుంటే విషం తాగి ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. దీంతో మున్సిపల్ అధికారులు పోలీసులకు సమాచారమివ్వగా, వారు వచ్చి ఆందోళనకారులను పోలీస్స్టేషన్కు తరలించారు. విధులకు ఆటంకం కలిగించారని మున్సిపల్ కమిషనర్ సతీశ్ ఫిర్యాదు మేరకు ఆందోళన చేసిన వారిపై భారత న్యాయ సంహిత సెక్షన్ 221(బీఎన్ఎస్), 126 క్లాస్(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రవికుమార్ పేర్కొన్నారు.