ఎదులాపురం, జూన్ 29 : ధరణి పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించాలని సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ కలెక్టర్లను ఆదేశించారు. శనివారం హైదరాబాద్ సీసీఎల్ఏ కార్యాలయం నుంచి వివిధ జిల్లాల కలెక్టర్లతో ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ శ్యామలాదేవితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల పరిష్కారంపై కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. తహసీల్దార్, రెవెన్యూ డివిజన్ అధికారి, అదనపు కలెక్టర్, కలెక్టర్ స్థాయిలో పెండింగ్ ఉన్న దరఖాస్తులను వేగవంతంగా ప్రణాళికాబద్ధంగా పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఆర్డీవో వినోద్ కుమార్, తహసీల్దార్ సంపత్ పాల్గొన్నారు.
నిర్మల్ అర్బన్, జూన్ 29 : ధరణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. శనివారం సీసీఎల్ఏ కార్యదర్శి నవీన్ మిట్టల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్లో రెవెన్యూ అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్, భైంసా ఆర్డీవో కోమల్రెడ్డి, కలెక్టర్ ఏవో సూర్యారావు పాల్గొన్నారు.