ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్, జూలై 4 : జిల్లాలో నీతి ఆయోగ్ సంపూర్ణత అభియాన్ లక్ష్యాలను సమన్వయంతో సాధిద్దామని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారీ, సిర్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు, జిల్లా అటవీ శాఖ అధికారి నీరజ్కుమార్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్తో కలిసి వివిధ శాఖల జిల్లా అధికారులు, ఉపాధ్యాయులతో నీతి ఆయోగ్ సంపూర్ణత అభియాన్ లక్ష్యాల సాధనపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీతి ఆయోగ్లో భాగంగా వెనుకబడిన ప్రాంతా ల్లో ఆరోగ్యం, విద్య, వైద్యం, వ్యవసాయం, స్వయం సహాయక సంఘాల అభివృద్ధి, మహిళలు, శిశువుల సంక్షేమం.. తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.
సంపూర్ణత అభియాన్లో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు అధికారులు సమష్టిగా కృషి చే యాలని కోరారు. గర్భం దాల్చిన మహిళల వివరాలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ హాస్పిటల్స్లో నమోదు చేయాలని, ప్రతి నెలా సమయానుసారంగా పరీక్షలు చేయించుకొని, పౌష్టికాహా రం, మందులు సకాలంలో తీసుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారు. డయాబెటిస్, హైపర్ టెన్షన్వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు దవాఖానలకు వెళ్లి పరీక్షలు చేయించుకునేలా అధికారులు వివరించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు పోషక విలువలు కలిగిన ఆహారం అందించాలని, గర్భస్థ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేయాలని సూ చించారు.
ప్రతి రైతు భూసార పరీక్షలు చేయించుకొని కార్డులు పొందాలని, ఆ నివేదిక ఆధారంగా సాగు చేయాల్సిన పం టలపై రైతులకు మెళకువలు అందిస్తారని చెప్పారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో విద్యార్థులకు సకల సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభు త్వం కృషి చేస్తుందని తెలిపారు. మహిళాశక్తి పథకం ద్వారా స్వయం సహాయక సం ఘాలకు చేయూతనందిస్తామని పేర్కొన్నారు. అనంతరం జిల్లా గ్రా మీణా అభివృద్ధి, విద్య, ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. వైద్య శిబిరంలో స్వయం గా బీపీ పరీక్ష చే యించుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి తుకా రాం, జడ్పీటీసీలు నాగేశ్వర్రావు, శ్రీరామరావు, సంతోష్, డీఎంహెచ్వో తుకారాం, జిల్లా సంక్షేమశాఖ అధికారి భాస ర్, జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ ఏపీడీ రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.