మందమర్రి రూరల్, జూన్ 19 : సికిల్ సెల్ వ్యాధిని నివారించాలంటే అవగాహనతోనే సాధ్యమవుతుందని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మందమర్రి పట్టణంలోని ఆదర్శ(మోడల్) పాఠశాలలో బుధవారం జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, అదనపు కలెక్టర్ బీ రాహుల్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అనితతో కలిసి సికిల్ సెల్ పక్షోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జిల్లాలో పూర్తిస్థాయిలో సికిల్సెల్ నిర్మూలించే దిశగా ప్రభు త్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శా ఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు జి ల్లాలో జూలై 3వ తేదీ వరకు సికిల్ సెల్ ని ర్మూలనపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మందమర్రి పట్టణంలో 430 మందికి పరీక్షలు చేసినట్లు తెలిపారు. జిల్లాలోని 149 ఉప కేంద్రా లు, 17 పీహెచ్సీలు, పల్లె దవాఖానాలు, బ స్తీ దవాఖానాల్లో ఆశ కార్యకర్తల ద్వారా అవగాహన కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి గంగారాం, ప్రోగ్రాం అ ధికారి ఫయాజ్, ఎన్హెచ్ఎం డీపీవో ప్రశాం తి, సబ్ యూనిట్ అధికారులు నాందేవ్, స త్యనారాయణ, వైద్యాధికారి రమేశ్, పాఠశాల ప్రిన్సిపల్ జయకృష్ణారెడ్డి, మాస్ మీడియా అధికారి బుక వెంకటేశ్వర్లు, అల్లాడి శ్రీనివాస్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
దండేపల్లి, జూన్ 19 : దండేపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఎంపీపీ గడ్డం శ్రీనివాస్ అవగాహన కల్పించారు. వైద్యులు పరీక్షలు చేశారు. అలాగే తాళ్లపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో స్థానిక పీహెచ్సీ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కల్పించి, పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు ముత్యాల శ్రీనివాస్, కంది హేమలత-సతీశ్కుమార్, ముత్తె రాజన్న, వైద్యాధికారులు సతీశ్కుమార్, క్రాంతికుమార్, ఆయా పాఠశాలల హెచ్ఎంలు సుదర్శన్, శంకర్గౌడ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
కోటపల్లి, జూన్ 19 : కోటపల్లి కేజీబీవీ, గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులతో కలసి వైద్య సిబ్బంది సికిల్సెల్పై అవగాహన ర్యాలీలు తీశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పరీక్షలు చేసి, లక్షణాలు, నివారణ చర్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ ఎస్వో హరిత, ఆశ్రమ పాఠశాల హెచ్ఎం లావణ్య, వార్డెన్ సుమలత, ఏఎన్ఎం తిరుపతమ్మ, వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
జైనూర్ జూన్ 19 : మండల కేంద్రంలోని సరార్ దవాఖానలో సికిల్ సెల్ దినోత్సవాన్ని వైద్యులు వైస్ ఎంపీపీ చెర్లె లక్ష్మణ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి డీడీవో జితేందర్ మాట్లాడారు. వైస్ ఎంపీపీ చెర్లె లక్ష్మణ్, మాజీ జంగాం సర్పంచ్ కుమ్ర శ్యామ్రావ్, హెల్త్ అసిస్టెంట్ విజయ్, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆసిఫాబాద్ టౌన్, జూన్19 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని బాలికల గురుకుల కళాశాలలో సికిల్ సెల్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా డిప్యూటీ వైద్యాధికారి ప్రోగ్రామ్ అధికారి సుధాకర్ నాయక్, గిరిజన సంక్షేమ శాఖ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ రమాదేవి, జడ్పీటీసీ నాగేశ్వరరావు, జీసీడీవో శకుంతల, ఎంపీపీ మల్లికార్జున్ కలిసి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వైద్య సిబ్బంది పాల్గొన్నారు.