కాగజ్నగర్, జూన్ 24 : నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయాల్సిన ఎమ్మెల్యే దీక్షలు చేయడం ఎంత వరకు సమంజసమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు. సోమవారం మండలంలోని అందెవెళ్లి పెద్దవాగు బ్రిడ్జిని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ సకాలంలో ఆప్రో చ్ రోడ్డు పనులు పూర్తి చేయకపోవడంతో తాత్కాలికంగా నిర్మించిన వంతెన కొట్టుకుపోయిందని, ద హెగాం, భీమిని మండలాల్లోని 54 గ్రామాలకు రా కపోకలు నిలిచిపోయాయన్నారు.
అనంతరం బె జ్జూర్ మండలంలోని పలు గ్రామాలాల్లో తిరిగి స మస్యలు తెలుసుకున్నారు. అనంతరం బెజ్జూర్లో విలేకరులతో మాట్లాడుతూ బెజ్జూర్ మండలం సో మిని, తాలయి, అంబగట్టు గ్రామాల్లో పోలీసు వ్య వస్థ అధికార పార్టీ కనుసన్నల్లో కొనసాగుతుందన్నారు. పేదల భూములను ఆక్రమిస్తున్నారని, ప్ర భుత్వం ఇచ్చిన పట్టాలు ఉన్నాయని పలువురు బె జ్జూర్ ఎస్ఐ దృష్టికి తీసుకెళ్తే.. అవి ఒరిజనల్స్ పట్టా లా.. లేక డూప్లికేట్ పట్టాలా అని బెజ్జూర్ ఎస్ఐ త హసీల్దార్కు లేఖ రాయడం విడ్డూరంగా ఉందన్నా రు. నాయకులు రాంప్రసాద్, రాజ్కుమార్, యాద వ్, అంజన్న, శేఖర్, చిన్నయ్య పాల్గొన్నారు.